పిల్లలు తప్పు చేస్తే.. పెద్దలకు ‘శిక్ష’ణ!
ABN , First Publish Date - 2021-10-24T08:16:41+05:30 IST
పిల్లలపై ఒత్తిడి తగ్గేంచే దిశగా చైనా సరికొత్త విద్యా చట్టాన్ని రూపొందించింది. వారిపై హోమ్ వర్క్, ట్యూషన్ల భారాన్ని తగ్గించాలని నిర్ణయించింది.
చైనాలో వినూత్న చట్టం
బీజింగ్, అక్టోబరు 23: పిల్లలపై ఒత్తిడి తగ్గేంచే దిశగా చైనా సరికొత్త విద్యా చట్టాన్ని రూపొందించింది. వారిపై హోమ్ వర్క్, ట్యూషన్ల భారాన్ని తగ్గించాలని నిర్ణయించింది. 18 ఏళ్ల లోపు పిల్లలు ఇకపై వారానికి 3 గంటలు మాత్రమే ఆన్లైన్ గేమ్స్ ఆడుకునేందుకు అనుమతినిచ్చింది. ఇక.. పిల్లలు తప్పుచేస్తే వారి తల్లిదండ్రులను శిక్షించాలని కూడా జిన్పింగ్ ప్రభుత్వం నిర్ణయించింది. పిల్లలు తప్పుచేస్తే.. తల్లిదండ్రులు పనిచేసే సంస్థల యజమానులతో ఆయా తల్లిదండ్రులకు పిల్లల పెంపకంపై శిక్షణ ఇప్పిస్తారు. ఆ తరగతులకు హాజరుకాకుంటే.. రూ.12 వేలు జరిమానా గానీ, 5 రోజుల జైలు శిక్ష గానీ విధిస్తారు. ఈ చట్టాలపై చైనీయుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.