పిల్లలకు కరోనాపై ఆందోళన వద్దు: డబ్ల్యూహెచ్వో
ABN , First Publish Date - 2021-08-25T08:07:55+05:30 IST
పిల్లలకు కరోనా ముప్పుపై తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డబ్ల్యూహెచ్వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామి నాథన్ తెలిపారు.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: పిల్లలకు కరోనా ముప్పుపై తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డబ్ల్యూహెచ్వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామి నాథన్ తెలిపారు. భారత్లో కొవిడ్ వైరస్ వ్యాప్తి స్వల్ప, మధ్యస్థ స్థాయిలో సాగుతోందని, ఏదో ఒక ప్రాంతానికే పరిమితమయ్యే(ఎండెమిసిటీ) దిశగా ఉందని చెప్పారు. గతంలో మాదిరిగా భారీ స్థాయిలో కేసులు నమోదయ్యే పరిస్థితులు లేవన్నారు. ప్రస్తుతం కొత్త కేసుల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉన్నా యన్నారు. వైరస్కు గురయ్యే జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలు, కరోనా రెండు వేవ్లలోనూ ప్రభావితం కానివారు, టీకా పంపిణీ తక్కువగా జరిగిన చోట్ల మాత్రం రానున్న నెలల్లో కేసులు భారీగా నమోదవుతాయని స్పష్టం చేశారు. కొవాగ్జిన్ టీకాకు సెప్టెంబరు మధ్య నాటికి డబ్ల్యూహెచ్వో గుర్తింపు దక్కుతుందని సౌమ్య స్వామినాథన్ ఆశాభావం వ్యక్తం చేశారు.