Chennai నుంచి శబరిమలకు చార్జీ రూ.1050
ABN , First Publish Date - 2021-12-04T17:03:20+05:30 IST
రాష్ట్రం నుంచి శబరిమలకు ప్రత్యేక బస్సు సర్వీసులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కోయంబేడు బస్స్టేషన్ నుంచి మధ్యాహ్నం 2.45 గంటలకు మొదటి బస్సు బయల్దేరి వెళ్లింది. ఈ బస్సులో ప్రయాణానికి
ప్యారీస్(చెన్నై): రాష్ట్రం నుంచి శబరిమలకు ప్రత్యేక బస్సు సర్వీసులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కోయంబేడు బస్స్టేషన్ నుంచి మధ్యాహ్నం 2.45 గంటలకు మొదటి బస్సు బయల్దేరి వెళ్లింది. ఈ బస్సులో ప్రయాణానికి రూ.1,050లు చార్జిగా నిర్ణయించారు. శబరిమలలో డిసెంబరు, జనవరి మాసాల్లో జరిగే పూజల్లో పాల్గొని భక్తులు ఇరుముడి సమర్పించడం ఆనవాయితీ. ఈ ఏడాది శబరిమల సీజన్కు రాష్ట్రం నుంచి వెళ్లే భక్తుల సౌకర్యార్ధం రాష్ట్రప్రభుత్వ రవాణా సంస్థలు 2022, జనవరి 16 వరకు ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు రవాణా శాఖ మంత్రి రాజకన్నప్పన్ ప్రకటించారు. కేరళలో కొవిడ్ నిబంధనలు అమలులో ఉన్నందున అక్కడికి రాష్ట్రం నుంచి నడపనున్న 64 బస్సులకు రాష్ట్రప్రభుత్వ రవాణా శాఖ అనుమతి కూడా పొందింది. ఈ బస్సుల వివరాలు తెలుసుకొనేందుకు 9445014412, 9445014450 అనే నెంబర్లను సంప్రదించవచ్చు.