1న రెండు పోలీసు కమిషనరేట్లు షురూ

ABN , First Publish Date - 2021-12-26T16:27:19+05:30 IST

గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనరేట్‌ విభజన మేరకు కొత్తగా ఏర్పాటైన తాంబరం, ఆవడి పోలీసు కమిషనరేట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ వచ్చే యేడాది జనవరి 1వ తేదీన ప్రారంభించనున్నారు. తాంబరం పోలీసు

1న రెండు పోలీసు కమిషనరేట్లు షురూ

చెన్నై: గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనరేట్‌ విభజన మేరకు కొత్తగా ఏర్పాటైన తాంబరం, ఆవడి పోలీసు కమిషనరేట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ వచ్చే యేడాది జనవరి 1వ తేదీన ప్రారంభించనున్నారు. తాంబరం పోలీసు కమిషనర్‌గా రవి, ఆవడి పోలీసు కమిషనర్‌గా సందీప్‌రాయ్‌ రాథోడ్‌ నియమితులైన విషయం తెలిసిందే. వీరిరువురూ ప్రస్తుతం తాత్కాలిక కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి కంటూ అధికారికంగా పోలీసు కమిషనర్‌ కార్యాలయాలు ఏర్పాటు చేయలేదు. ఈ పరిస్థితుల్లో జనవరి ఒకటి నుంచి ఈ రెండు పోలీసు కమిషన రేట్లను ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రారంభించనున్నారు. ఈ కమిషనరేట్లు పనిచేయడం ప్రారంభిస్తే ఆ రెండు ప్రాంతాల్లో నేరాల సంఖ్య తగ్గుముఖం పడతుందని, శాంతిభద్రతలు మరింత పటిష్టమవుతాయని డీజీపీ శైలేంద్రబాబు తెలిపారు. నగరంలో మూడు పోలీసు కమిషనర్‌ కార్యాలయాలు పని చేయడం వల్ల నేరాలను సకాలంలో గుర్తించడంతో పాటు నేరస్థులను వీలైనంత త్వరగా అరెస్టు చేయడానికికూడా వీలవుతుందని వివరించారు. 

Updated Date - 2021-12-26T16:27:19+05:30 IST