కరోనా పరీక్షలకు భయపడి యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-05-13T18:02:31+05:30 IST
రాణిపేట జిల్లా అరక్కోణం సమీపంలో కరోనా పరీక్షలు చేయించుకోవాలని బంధువులు, చుట్టుపక్కల వారు ఒత్తిడి చేయడంతో భయపడిన
చెన్నై/ పెరంబూర్: రాణిపేట జిల్లా అరక్కోణం సమీపంలో కరోనా పరీక్షలు చేయించుకోవాలని బంధువులు, చుట్టుపక్కల వారు ఒత్తిడి చేయడంతో భయపడిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అరక్కోణం సమీపం సూరప్పనాయకుడుకండిగై గ్రామానికి చెందిన కూలీ కార్మికుడు శరవణన్ (45) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. అతనిని కరోనా పరీక్షలు చేయించుకోవాలని బంధువులు, చుట్టుపక్కల వారు ఒత్తిడి చేశారు. దీంతో, పరీక్షలకు భయపడిన శరవణన్ బుధవారం ఉదయం గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.