నగరంలో మళ్లీ Cycle గస్తీ
ABN , First Publish Date - 2021-12-10T16:14:12+05:30 IST
నగరంలో నేరాలను అడ్డుకొనేందుకు మళ్లీ సైకిల్ గస్తీ పనులను పోలీస్ కమిషనర్ శంకర్ జివాల్ పరిచయం చేశారు. రాష్ట్రంలో ఇదివరకు పోలీసులు సైకిళ్లపైనే గస్తీ తిరిగేవారు. దీని ద్వారా స్థానికులతో సన్నిహిత
ఐసిఎఫ్(చెన్నై): నగరంలో నేరాలను అడ్డుకొనేందుకు మళ్లీ సైకిల్ గస్తీ పనులను పోలీస్ కమిషనర్ శంకర్ జివాల్ పరిచయం చేశారు. రాష్ట్రంలో ఇదివరకు పోలీసులు సైకిళ్లపైనే గస్తీ తిరిగేవారు. దీని ద్వారా స్థానికులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడి నేరస్తులను సులభంగా పట్టుకొనేవారు. అయితే హఠాత్తుగా సైకిల్ గస్తీ పనులు ఆపేసి వాటి స్థానంలో ఆధునిక వాహనాలు ప్రవేశపెట్టారు. దీంతో పోలీసులు వాహనాల నుంచి దిగకుండానే విచారించే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో, నగరంలో మళ్లీ సైకిల్ గస్తీ పనులు ప్రారంభించాలని అదనపు కమిషనర్లు కన్నన్, సెంథిల్కుమార్లకు కమిషనర్ శంకర్ జివాల్ ఉత్తర్వులు జారీచేశారు. ఆ ఉత్తర్వుల మేరకు జాయింట్ కమిషనర్ రాజేశ్వరి, అంబత్తూర్ డిప్యూటీ కమిషనర్ మహేష్ పర్యవేక్షణలో సహాయ కమిషనర్ ముత్తువేల్పాండి పూందమల్లి, నజరేత్పేట ప్రాంతాల్లో బుధవారం రాత్రి సైకిల్ గస్తీ ప్రారంభించారు.