ఎయిర్పోర్టులో స్కానింగ్కు చిక్కకుండా విదేశీ కరెన్సీ తరలించే యత్నం
ABN , First Publish Date - 2021-12-17T13:41:28+05:30 IST
చెన్నై ఎయిర్పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది.
తమిళనాడు: చెన్నై ఎయిర్పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి రూ.69 లక్షలు విలువచేసే 3,47,200 రియాల్స్, వెయ్యి డాలర్లను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఎయిర్పోర్టులో స్కానింగ్కు చిక్కకుండా విదేశీ కరెన్సీని ప్రయాణికుడు లగేజ్ బ్యాగ్లో దాచాడు. అనుమానించిన కస్టమ్స్ అధికారులు ప్రయాణికుడి లగేజ్లో సోదాలు చేసి విదేశీ కరెన్సీని గుర్తించారు. ప్రయాణికుడిపై కస్టమ్స్ అధికారులు ఫెమా యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.