Delhi: రాష్ట్రాల ఆర్థికశాఖ మంత్రులతో కేంద్రమంత్రి నిర్మల భేటీ
ABN , First Publish Date - 2021-12-30T17:31:25+05:30 IST
రాష్ట్రాల ఆర్ధిక శాఖ మంత్రులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు.
న్యూఢిల్లీ: రాష్ట్రాల ఆర్ధిక శాఖ మంత్రులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. గురువారం ఉదయం ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో ప్రారంభమైన సమావేశానికి రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. ఏపీ నుండి ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, తెలంగాణ నుంచి ఆర్ధిక శాఖ కార్యదర్శి సమావేశంలో పాల్గొన్నారు. 2022 - 23 బడ్జెట్ రూపకల్పనపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మల సీతారామన్ సంప్రదింపులు జరపనున్నారు. ఇప్పటికే బడ్జెట్ రూపకల్పనపై వివిధ రంగాల ప్రముఖులు, నిపుణులతో నిర్మల సీతారామన్ సంప్రదింపులు జరిపిన విషయం తెలిసిందే.