7 న కేంద్ర కేబినెట్ విస్తరణ! ఏడుగురిపై వేటు వేయనున్న మోదీ!
ABN , First Publish Date - 2021-07-06T01:17:38+05:30 IST
కేంద్ర కేబినెట్ విస్తరణ బుధవారం జరగనున్నట్లు సమాచారం. ఈ మేరకు అధికార యంత్రాంగానికి సూచనలు కూడా అందినట్లు తెలుస్తోంది
న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్ విస్తరణ బుధవారం జరగనున్నట్లు సమాచారం. ఈ మేరకు అధికార యంత్రాంగానికి సూచనలు కూడా అందినట్లు తెలుస్తోంది. 7న ఉదయం 11 గంటలకు లేదా 12 గంటలకు విస్తరణ ఉండే అవకాశాలున్నాయి. కొత్తగా 20 మందికి చోటు దక్కనున్నట్లు సమాచారం. యూపీ నుంచి ఎక్కువ మందికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరినీ కేంద్ర కేబినెట్లోకి తీసుకోవడం లేదని సమాచారం. కొన్ని రోజులుగా ప్రధాని మోదీ వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. వారి వారి శాఖల పురోగతిని అడిగి తెలుసుకుంటున్నారు. ఈ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డా కూడా పాల్గొంటారు. ఈ భేటీల ఆధారంగా మోదీ ఓ కేంద్ర మంత్రులపై ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. 7 నుంచి 8 మంది కేంద్ర మంత్రులను మోదీ తొలగించనున్నట్లు ఢిల్లీ వేదికగా వార్తలొస్తున్నాయి.