బస్సులో హఠాత్తుగా మంటలు...

ABN , First Publish Date - 2021-09-30T13:42:09+05:30 IST

స్థానిక కోయంబేడు సమీపంలో హఠాత్తుగా ప్రభుత్వ బస్సులో మంటలు రేగాయి. గమనించిన డ్రైవర్‌ సమయస్పూర్తితో వ్యవహరించడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తిరు

బస్సులో హఠాత్తుగా మంటలు...

               - సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు



పెరంబూర్‌(చెన్నై): స్థానిక కోయంబేడు సమీపంలో హఠాత్తుగా ప్రభుత్వ బస్సులో మంటలు రేగాయి. గమనించిన డ్రైవర్‌ సమయస్పూర్తితో వ్యవహరించడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తిరుచ్చి నుంచి చెన్నైకి బుధవారం ఉదయం వస్తున్న ప్రభుత్వ బస్సులో కోయంబేడు సమీపంలో ఇంజన్‌ నుంచి హఠాత్తుగా మంటలు తలెత్తాయి. దీనిని గమనించిన డ్రైవర్‌ వెంటనే బస్సును నిలిపి ప్రయాణికులను త్వరగా దిగాలని హెచ్చరించాడు. ఈ హఠాత్‌ పరిణామానికి దిగ్ర్భాంతి చెందిన ప్రయాణికులు బస్సు నుంచి దిగారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు వాహనాలతో అక్కడకు చేరుకొని అరగంట పాటు శ్రమించి మంటలు అదుపుచేశారు. 

Updated Date - 2021-09-30T13:42:09+05:30 IST