మహమ్మారిగా బ్లాక్ఫంగస్: రాజస్థాన్ సర్కారు
ABN , First Publish Date - 2021-05-20T07:04:48+05:30 IST
దేశంలో బ్లాక్ఫంగస్ వ్యాధి ప్రమాదకరంగా విస్తరిస్తున్న వేళ.. రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ అంటువ్యాధుల చట్టం 2020 ప్రకారం ఈ వ్యాధిని మహమ్మారిగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది

జైపూర్, మే 19: దేశంలో బ్లాక్ఫంగస్ వ్యాధి ప్రమాదకరంగా విస్తరిస్తున్న వేళ.. రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ అంటువ్యాధుల చట్టం 2020 ప్రకారం ఈ వ్యాధిని మహమ్మారిగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సవాయ్ మాన్సింగ్ ఆస్పత్రిలో బ్లాక్ఫంగస్ చికిత్సకు ప్రత్యేక వార్డును ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. రాజస్థాన్లో ఇప్పటివరకు వందకు పైగా బ్లాక్ఫంగస్ కేసులు వెలుగులోకి వచ్చాయి.