వచ్చే electionsలో మెరుగైన ఫలితాలు
ABN , First Publish Date - 2021-10-19T15:21:22+05:30 IST
రాబోయే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన 9 జిల్లాల స్థానిక ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేసి గెలుపొందిన అభ్యర్ధులు సోమవారం స్థానిక
- bjp రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై
చెన్నై: రాబోయే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన 9 జిల్లాల స్థానిక ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేసి గెలుపొందిన అభ్యర్ధులు సోమవారం స్థానిక టి.నగర్లోని పార్టీ ప్రధాన కార్యాలయం కమలాలయంలో సమావేశమయ్యారు. సమావేశంలో మాజీ కేంద్రమంత్రి పొన్. రాధాకృష్ణన్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీసీ దురైస్వామి, ప్రధాన కార్యదర్శి కరు నాగరాజన్, మాజీ ఎమ్మెల్యే ఎంసీ సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నామలై మాట్లాడుతూ, పార్టీ అభ్యర్ధులను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని, రాబోయే ఎన్నికల్లో పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని అన్నారు.