తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ‘సింగం’

ABN , First Publish Date - 2021-07-09T01:23:20+05:30 IST

బీజేపీ ‘యువ’ మంత్రం జపిస్తోంది. నిన్నటికి నిన్న జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణలోనూ మోదీ యువత వైపే ఎక్కువగా

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ‘సింగం’

చెన్నై : బీజేపీ ‘యువ’ మంత్రం జపిస్తోంది. నిన్నటికి నిన్న జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణలోనూ మోదీ యువత వైపే ఎక్కువగా మొగ్గు చూపారు. తాజాగా తమిళనాడు విషయంలోనూ బీజేపీ అధిష్ఠానం యువత వైపే మొగ్గు చూపింది. ఐపీఎస్ మాజీ అధికారి అన్నామలై కుప్పుస్వామిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకూ ఈయన రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్. మురుగన్ కేంద్ర మంత్రిగా ప్రమోషన్ రావడంతో ఆయన స్థానంలో అన్నామలైకు బాధ్యతలు అప్పజెప్పారు. అన్నామలై కుప్పుస్వామి 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. గతంలో కర్నాటకలో విధులు నిర్వర్తించేవారు. విధుల్లో నిక్కచ్చిగా ఉండటంతో ఆయనను ప్రజలు ముద్దుగా ‘సింగం’ అని పిలుచుకునేవారు. అంతేకాకుండా అత్యంత నిజాయితీపరుడైన అధికారిగా మన్ననలు పొందారు. 


Updated Date - 2021-07-09T01:23:20+05:30 IST