బీజేపీ..కామరాజ్ జపం
ABN , First Publish Date - 2021-03-14T08:03:03+05:30 IST
‘ఉత్తర భారత పార్టీ’ ముద్రను చెరిపేసుకునేందుకు బీజేపీ తమిళనాట రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. తమిళుల చేత, ‘మనపార్టీ’ అనిపించుకునేందుకు అన్ని రకాలుగానూ కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే దివంగత ముఖ్యమంత్రులు
![బీజేపీ..కామరాజ్ జపం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఎంజీఆర్.. జయలలితల స్తుతి కూడా
చెన్నై-ఆంధ్రజ్యోతి: ‘ఉత్తర భారత పార్టీ’ ముద్రను చెరిపేసుకునేందుకు బీజేపీ తమిళనాట రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. తమిళుల చేత, ‘మనపార్టీ’ అనిపించుకునేందుకు అన్ని రకాలుగానూ కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే దివంగత ముఖ్యమంత్రులు కామరాజ్(కాంగ్రెస్), ఎంజీఆర్, జయలలిత(అన్నాడీఎంకే)ల పేర్లను ఆ పార్టీ నేతలు జపిస్తున్నారు. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం ఆ ముగ్గురి విగ్రహాలకు అంజలి ఘటించడంతోపాటు, వారి బాటలో పయనిస్తామని పలు బహిరంగసభల్లో ప్రకటించారు. అయితే బీజేపీ నేతల తీరును టీఎన్సీసీ నేతలు ఖండించారు. బీజేపీకి రాష్ట్రంలో తమ నేతలంటూ చెప్పుకునేందుకు ఎవరూ లేక, కాంగ్రెస్ నేత పేరు స్తుతిస్తోందంటూ ఎద్దేవా చేస్తున్నారు.