బెంగాల్ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన బీజేపీ
ABN , First Publish Date - 2021-03-14T21:59:14+05:30 IST
తమిళనాడు బీజేపీ అభ్యర్థుల జాబితాను ఆదివారం బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. మూడోదశ జాబితాలో 27 మందికి చోటు
![బెంగాల్ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన బీజేపీ](https://media.andhrajyothy.com/appimg/galleries/202103141041418/03142021162914n88.jpg)
న్యూఢిల్లీ : బెంగాల్ బీజేపీ అభ్యర్థుల జాబితాను ఆదివారం బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. మూడోదశ జాబితాలో 27 మందికి చోటు దక్కగా, నాలుగో దశ జాబితాలో 38 మందికి చోటు దక్కింది. రవీంద్ర భట్టాచార్య సింగూర్ నుంచి, స్వపన్ దాస్గుప్తా తారకేశ్వర్, నిషిత్ ప్రామాణిక్ దిన్హట, కేంద్ర మంత్రి బబూల్ సుప్రియో టోలీగంగ్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక లాకెట్ ఛటర్జీ చున్చుర నుంచి, అంజనా బసు సోనార్ పూర్ నుంచి, ఇంద్రనీల్ దాస్ కస్బా, తనుశ్రీ చక్రవర్తి హౌరా నుంచి బరిలోకి దిగుతున్నారు.