బంగ్లా’ ప్రధానిపై హత్యాయత్నం కేసులో.. 21ఏళ్ల తర్వాత 14 మందికి మరణ దండన
ABN , First Publish Date - 2021-03-24T10:32:00+05:30 IST
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాపై హత్యాయత్నం చేసిన కేసులో 14 మందికి మరణ దండన విధిస్తూ ఢాకాలోని ఓ కోర్టు తీర్పు చెప్పింది.

ఢాకా, మార్చి 23: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాపై హత్యాయత్నం చేసిన కేసులో 14 మందికి మరణ దండన విధిస్తూ ఢాకాలోని ఓ కోర్టు తీర్పు చెప్పింది. 2000వ సంవత్సరంలో ఆమెపై ఇస్లామిక్ ఉగ్రవాదులు హత్యాయత్నం చేశారు. 21ఏళ్లపాటు సుదీర్ఘంగా కేసు విచారణ జరిగింది. శిక్షను బంగ్లా చట్టాల ప్రకారం సుప్రీం కోర్టు ఖరారు చేయాల్సి ఉంటుంది.