Lakhimpur Kheri హింస: మంత్రి కుమారుడికి 3 రోజుల కస్టడీ
ABN , First Publish Date - 2021-10-12T01:05:15+05:30 IST
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి హింస ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన కేంద్ర మంత్రి
లఖింపూర్ ఖేరి: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి హింస ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను కోర్టు మూడు రోజుల పోలీస్ రిమాండ్కు పంపింది. ఈ నెల 3న లఖింపూర్ ఖేరిలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపైకి మంత్రి కాన్వాయ్లోని ఓ వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు, ఓ జర్నలిస్టు సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనపై నమోదైన ఎఫ్ఐఆర్లో ఆశిష్ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఆశిష్ను శనివారం 12 గంటలపాటు విచారించిన పోలీసులు అనంతరం అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఆశిష్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో ఆయనను ఇంకా విచారించి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందన్న పోలీసుల అభ్యర్థనతో ఆశిష్ను కోర్టు మూడు రోజులపాటు పోలీసు కస్టడీకి అనుమతించింది.