కోర్టు తీర్పును ఫోర్జరీ చేసిన ‘ఐఏఎస్‌’ అరెస్టు

ABN , First Publish Date - 2021-07-12T08:26:15+05:30 IST

కోర్టు ఆదేశాలను ఫోర్జరీ చేసిన కేసులో మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ ఐఏఎస్‌ అధికారిని పోలీసులు అరెస్టు చేశారు.

కోర్టు తీర్పును ఫోర్జరీ చేసిన ‘ఐఏఎస్‌’ అరెస్టు

ఇండోర్‌, జూలై 11 : కోర్టు ఆదేశాలను ఫోర్జరీ చేసిన కేసులో మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ ఐఏఎస్‌ అధికారిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ మహిళపై దౌర్జన్యం చేసిన కేసులో నిందితుడైన ఆ అధికారి.. తను నిర్దోషి అంటూ ఫోర్జరీ కోర్టు తీర్పును తయారు చేయడం ద్వారా రాష్ట్ర కేడర్‌ నుంచి ఐఏఎస్‌ అధికారిగా ప్రమోషన్‌ పొందారు. భోపాల్‌ పట్టణ పరిపాలన, అభివృద్ధి శాఖకు అడిషనల్‌ కమిషనర్‌గా నియమితులైన ఐఏఎస్‌ అధికారి సంతోష్‌ వర్మను శనివారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఫోర్జరీ వ్యవహారంపై జూన్‌ 26న ఇండోర్‌ జిల్లా కోర్టులో కేసు నమోదైంది. 

Updated Date - 2021-07-12T08:26:15+05:30 IST