అన్నాడీఎంకే నుంచి ఎమ్మెల్యే తొలగింపు
ABN , First Publish Date - 2021-04-11T13:12:27+05:30 IST
కడలూరు జిల్లా పన్రుట్టి శాసనసభ నియోజకవర్గం అన్నాడీఎంకే శాసనసభ్యురాలు సత్యా పన్నీర్సెల్వంను పార్టీ నుంచి తొలగించారు.
చెన్నై: కడలూరు జిల్లా పన్రుట్టి శాసనసభ నియోజకవర్గం అన్నాడీఎంకే శాసనసభ్యురాలు సత్యా పన్నీర్సెల్వంను పార్టీ నుంచి తొలగించారు. ఈ మేరకు ఆ పార్టీ ఉప సమన్వయకర్త, ముఖ్యమంత్రి ఎడప్పాడి పన్నీర్సెల్వం, సమన్వయకర్త, ఉప ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం ఓ ప్రకటన జారీ చేశారు. శాసనసభ ఎన్నికల్లో తనకు మళ్లీ పార్టీ టికెట్ లభించలేదన్న ఆగ్రహంతో ఆమె పన్రుట్టి నియోజకవర్గంలో పోటీ చేసిన అన్నాడీఎంకే అభ్యర్థి రాజేంద్రన్కు వ్యతిరేకంగా డీఎంకే అభ్యర్థికి మద్దతుగాను పనిచేసినట్టు ఆరోపణలు రావటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమెతోపాటు పన్రుట్టి పురపాలక సంఘం మాజీ అధ్యక్షుడు పన్నీర్సెల్వంను కూడా పార్టీ నుంచి తొలగించారు.