Andhra బస్టాండులో తెలుగేదీ?
ABN , First Publish Date - 2021-10-29T13:43:26+05:30 IST
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులు నిలిచే మాధవరం బస్ టెర్మినల్లో తెలుగు అక్షరమే కనిపించడం లేదని తమిళనాడు తెలుగు పీపుల్ సొసైటీ విమర్శించింది. ఆ బస్టాండుకు ఏర్పాటు చేసిన బోర్డులో ఆంగ్ల, త

- తమిళనాడు తెలుగు పీపుల్ సొసైటీ
చెన్నై(Chennai): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులు నిలిచే మాధవరం బస్ టెర్మినల్లో తెలుగు అక్షరమే కనిపించడం లేదని తమిళనాడు తెలుగు పీపుల్ సొసైటీ విమర్శించింది. ఆ బస్టాండుకు ఏర్పాటు చేసిన బోర్డులో ఆంగ్ల, తమిళ అక్షరాలే తప్ప, తెలుగు లేదని వాపోయింది. అందువల్ల అక్కడ బోర్డులు తెలుగులో కూడా ఏర్పాటు చేయాలని సొసైటీ నిర్వాహక అధ్యక్షుడు దేవరకొండ రాజు ఏపీఎస్ఆర్టీసీ మాధవరం బస్ టెర్మినల్ మేనేజర్ వెంకటేశ్వర్లుకు, సీఎండీఏ మెంబర్ సెక్రటరీ అన్షుల్ మిశ్రాకి, సీఎండీఏ అధికారులకు వినతిపత్రాన్ని అందించారు. దీనిపట్ల అధికారులు సానుకూలంగా స్పందించినట్లు రాజు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.