ఇది దేశం గర్వించదగిన క్షణం: అమిత్ షా
ABN , First Publish Date - 2021-07-26T03:49:26+05:30 IST
ఇది దేశం గర్వించదగిన క్షణం: అమిత్ షా
న్యూఢిల్లీ: తెలంగాణలోని కాకతీయ రుద్రేశ్వరాలయం (రామప్ప)ను యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించడం యావత్ దేశానికి ఎంతో ఆనందకరమైన విషయమని ట్విట్టర్లో కేంద్రహోమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ దిగ్గజ ఆలయం గొప్ప భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యానికి, హస్తకళకు చక్కటి ఉదాహరణ అని ఆయన తెలిపారు. ఇది దేశం గర్వించదగిన క్షణమని అమిత్ షా ఆనందం వ్యక్తం చేశారు.