Abhishek Banerjee కాన్వాయ్ పై దాడి
ABN , First Publish Date - 2021-08-02T19:59:57+05:30 IST
తృణమూల్ ఎంపీ, మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ కాన్వాయ్పై త్రిపురలో దాడి జరిగింది. ఈ మేరకు తృణమూల్ సోషల్ మీడియాలో
అగర్తలా : తృణమూల్ ఎంపీ, మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ కాన్వాయ్పై త్రిపురలో దాడి జరిగింది. ఈ మేరకు తృణమూల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే బీజేపీ నేతలే అభిషేక్పై దాడికి దిగారని తృణమూల్ ఆరోపించింది. ‘‘బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం ఎలా వుందో చూడండి. సీఎం విప్లవ్ దేవ్ గారూ.... రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కొత్త శిఖరాల వైపు తీసుకెళ్తున్నారు’’ అంటూ అభిషేక్ ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు.