20 సెకన్లు ఆగి.. దోచేస్తున్నారు!

ABN , First Publish Date - 2021-06-23T09:57:16+05:30 IST

గ్రేటర్‌ చెన్నై పరిధిలోని ఎస్‌బీఐ ఏటీఎంలలో తరచుగా నగదు మాయం అవుతోంది. ఏటీఎం ట్యాంపరింగ్‌ ఆనవాళ్లు లేవు. దీంతో బ్యాంకు అధికారులు పోలీసులను ఆశ్రయించారు

20 సెకన్లు ఆగి.. దోచేస్తున్నారు!

ఎస్‌బీఐ ఏటీఎంలలో వరుస చోరీలు


చెన్నై, జూన్‌ 22: గ్రేటర్‌ చెన్నై పరిధిలోని ఎస్‌బీఐ ఏటీఎంలలో తరచుగా నగదు మాయం అవుతోంది. ఏటీఎం ట్యాంపరింగ్‌ ఆనవాళ్లు లేవు. దీంతో బ్యాంకు అధికారులు పోలీసులను ఆశ్రయించారు.  పోలీసులు కూడా అమోమయానికి గురయ్యారు. ఏదో ఒక క్లూ దొరక్కపోదా అని దర్యాప్తు చేపట్టిన వారు ఒక కొత్త కోణాన్ని గుర్తించారు.  ఎస్‌బీఐ ఏటీఎంలలో కార్డు పెట్టి నగదు ఉపసంహరణ కోసం పిన్‌ నొక్కిన తర్వాత నగదు బయటకు వస్తుంది. దాన్ని 20 సెకన్లలోపు తీసుకోకపోతే మళ్లీ మెషిన్‌లోకి వెళ్లిపోతుంది. దొంగలు నగదుని బయటకు తీయకుండా  20 సెకన్లపాటు అలా పట్టుకునే ఉంటారు. దీంతో ఆ లావాదేవీ రద్దయినట్టు వస్తుంది. అప్పుడు వారు ఆ నగదుని తీసుకుని ఉడాయిస్తున్నారు అని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించారు. అయితే ఇంతవరకూ ఎవరినీ అరెస్టు చేయలేదు.

Updated Date - 2021-06-23T09:57:16+05:30 IST