విమానం ఆకాశంలో ఎగురుతుండగా ప్రయాణికుడి దుస్సాహసం
ABN , First Publish Date - 2021-03-28T15:16:25+05:30 IST
విమానం గాల్లో ఎగురుతుండగా ఓ ప్రయాణికుడు దుస్సాహసానికి
న్యూఢిల్లీ : విమానం గాల్లో ఎగురుతుండగా ఓ ప్రయాణికుడు దుస్సాహసానికి తెగించాడు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ను తెరిచేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతని దుశ్చర్యను విమానం సురక్షితంగా క్రిందికి దిగే వరకు నిరోధించారు. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్ళే విమానంలో శనివారం ఈ సంఘటన జరిగింది.
ఫూల్పూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపిన వివరాల ప్రకారం, ఢిల్లీ నుంచి వారణాసి వెళ్ళే విమానంలో శనివారం ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ను తెరిచేందుకు ప్రయత్నించాడు. సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆయనను నిరోధించి, అదుపులోకి తీసుకున్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యే వరకు ఆయనను అదుపులో ఉంచారు. ఆ ప్రయాణికుని మానసిక స్థితి సక్రమంగా లేదని తెలుస్తోంది. విమానం పైలట్ ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు తెలిపారు. తన విమానం క్రిందికి దిగేందుకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఆ ప్రయాణికుడిని కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సీఐఎస్ఎఫ్)కు అప్పగించారు.