తొమ్మిది మంది ips అధికారుల బదిలీ
ABN , First Publish Date - 2021-10-22T17:30:10+05:30 IST
ప్రభుత్వం తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బెంగళూరు ఉత్తర విభాగం డీసీపీగా వినాయక్ వసంతరావ్ పాటిల్, ఉడిపిలోని నక్సల్ నియంత్రణ దళం ఎస్పీగా ప్రకాష్
- బెంగళూరు నార్త్ డీసీపీగా వినాయక్ వసంతరావ్ పాటిల్
బెంగళూరు(Karnataka): ప్రభుత్వం తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బెంగళూరు ఉత్తర విభాగం డీసీపీగా వినాయక్ వసంతరావ్ పాటిల్, ఉడిపిలోని నక్సల్ నియంత్రణ దళం ఎస్పీగా ప్రకాష్ అమృత్ నిక్కం, బెంగళూరు థణిసంద్రలోని పోలీస్ శిక్షణా కళాశాల ప్రిన్సిపాల్గా కరుణాకరన్ నియమితులయ్యారు. బెంగళూరులోని ఫోరెన్సిక్ లేబోరేటరీ డైరెక్టర్గా ఎస్పీ ధర్మేంద్రకుమార్ మీనా, బెంగళూరు ఉత్తర విభాగం ట్రాఫిక్ డీసీపీగా ఎస్.సవితా నియమితులయ్యారు. బెంగళూరు కేంద్ర కార్యాలయం ఏడీజీపీగా ఎం.అశ్విని, మండ్య జిల్లా ఎస్పీగా డి.పెన్నేకర్, రాయచూరు జిల్లా ఎస్పీగా బి.నిఖిల్ నియమితులుగా కాగా ఎంఎన్ దీపన్, కలబుర్గి నగర ఏసీపీగా వ చ్చారు. ఈ మేరకు హోం శాఖ నగరంలో బుధవారం రాత్రి పోలీస్ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.