తమిళనాడులో 695 మందికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-03-14T13:37:47+05:30 IST

తమిళనాడులో శనివారం 695 కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో బాధితుల సంఖ్య 8,58,967కు పెరిగింది. చెన్నైలో 271 మందికి పాజిటివ్‌ లక్షణాలు...

తమిళనాడులో 695 మందికి పాజిటివ్‌

చెన్నై(ఆంధ్రజ్యోతి): తమిళనాడులో శనివారం 695 కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో బాధితుల సంఖ్య 8,58,967కు పెరిగింది. చెన్నైలో 271 మందికి పాజిటివ్‌ లక్షణాలు బయటపడడంతో నగరంలో కరోనా బాధితుల సంఖ్య 2,38,559కి పెరిగింది. రాష్ట్రంలో నలుగురు మృతిచెందగా...మొత్తం మృతుల సంఖ్య 12,543కి పెరిగింది. తాజాగా 512 మంది చికిత్సల తర్వాత కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.

Updated Date - 2021-03-14T13:37:47+05:30 IST