చెన్నపట్టణలో 60 అడుగుల చాముండేశ్వరీ దేవి పంచలోహ విగ్రహం

ABN , First Publish Date - 2021-08-10T18:10:11+05:30 IST

రామనగర్‌ జిల్లా చెన్నప ట్టణ తాలూకా గౌడగెరె గ్రామంలో దేశంలోనే అతిపెద్ద చాముండే శ్వరీ దేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు. 60 అడుగుల ఎత్తుతో 35వేల కేజీల పంచలోహ విగ్రహాన్ని రూపొందించారు.

చెన్నపట్టణలో 60 అడుగుల చాముండేశ్వరీ దేవి పంచలోహ విగ్రహం

బెంగళూరు: రామనగర్‌ జిల్లా చెన్నప ట్టణ తాలూకా గౌడగెరె గ్రామంలో దేశంలోనే అతిపెద్ద చాముండే శ్వరీ దేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు. 60 అడుగుల ఎత్తుతో 35వేల కేజీల పంచలోహ విగ్రహాన్ని రూపొందించారు. భీమన అమావాస్య రోజైన ఆదివారం చాముండేశ్వరీ దేవికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపి ఆవిష్కరించారు. శనివారం ఆరంభమైన పూజల ప్రక్రియ సోమవారం దాకా సాగింది. చాముండేశ్వరీ దేవికి రుద్రాభిషేకం, చక్రాభిషేకంలు జరిపారు. చాముండేశ్వరీ దేవి విగ్రహం 18 భుజాలు కలిగి అత్యంత సుందరంగా తీర్చబడింది. ఇందుకోసం 35వేల కిలోల పంచలోహాలు వినియోగించారు. బంగారం, వెండి, రాగి, కాంస్యం, ఇనుములను విగ్రహ నిర్మాణాలకై వాడారు. కొవిడ్‌ కారణంగా విగ్రహావిష్కరణ సాధారణంగా జరిపారు. స్థానిక భక్తులకు అవకాశం కల్పించినా భౌతిక దూరం, మాస్కులు తప్పనిసరి చేశారు.


Updated Date - 2021-08-10T18:10:11+05:30 IST