5 జిల్లాల్లోనే Covid ప్రభావం
ABN , First Publish Date - 2021-11-26T16:46:58+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కేసులు ఐదు జిల్లాల్లో ప్రభావం చూపుతున్నాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 306 మందికి పాజిటివ్ నిర్దారణ కాగా బెంగళూరులో 171, దార్వాడలో 42, మైసూరు 20, ఉడిపి, దక్షిణ కన్నడలో 13 మందికి

బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్ కేసులు ఐదు జిల్లాల్లో ప్రభావం చూపుతున్నాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 306 మందికి పాజిటివ్ నిర్దారణ కాగా బెంగళూరులో 171, దార్వాడలో 42, మైసూరు 20, ఉడిపి, దక్షిణ కన్నడలో 13 మందికి పాజిటివ్ ప్రబలింది. దార్వాడ మెడికల్ క ళాశాలలో 42 మందికి పాజిటివ్ తేలగా మరో 20 మందికి పైగా బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. 8 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 224 మంది కోలుకోగా ఇరువురు మృతిచెందారు. కలబుర్గి, కోలార్ జిల్లాల్లో ఒకొక్కరు ఉన్నారు. 28 జిల్లాల్లో ఒక్కరు కూడా మృతిచెందలేదు.