దేశంలో కొత్తగా 39,742 కరోనా కేసులు నమోదు
ABN , First Publish Date - 2021-07-26T14:49:04+05:30 IST
దేశంలో కొత్తగా 39,742 కరోనా కేసులు నమోదు చేశారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 533 మంది మృతి చెందారు. దేశంలో గడిచిన 24 గంటల్లో 39,972 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఢిల్లీ: దేశంలో కొత్తగా 39,742 కరోనా కేసులు నమోదు చేశారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 533 మంది మృతి చెందారు. దేశంలో గడిచిన 24 గంటల్లో 39,972 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ మొత్తంగా 4,20,551 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 4,08,212 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న 51,18,210 మందికి వ్యాక్సిన్ అందించారు. దేశంలో ఇప్పటి వరకు 43.31 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేశారు.