రూ.102 కోట్లతో ఉన్నత విద్యాశాఖకు కొత్త భవనాలు
ABN , First Publish Date - 2021-10-29T15:48:46+05:30 IST
చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువణ్నామలై జిల్లాల్లో ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో కళాశాలల్లో రూ.102 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త భవనాలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. గురువారం

- ప్రారంభించిన సీఎం స్టాలిన్
చెన్నై(Chennai): చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువణ్నామలై జిల్లాల్లో ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో కళాశాలల్లో రూ.102 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త భవనాలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. గురువారం ఉదయం సచివాలయంలో ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్త భవనాలకు శ్రీకారం చుట్టారు. ఆ నాలుగు జిల్లాల్లోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలు, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలు, ప్రభుత్వ సాంకేతిక కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, వైజ్ఞానిక కేంద్రాల్లో నిర్మించిన తరగతి గదుల కొత్త భవనాలు, ప్రయోగశాల భవనాలు, హాస్టల్ భవనాలు, స్టాఫ్ క్వార్టర్స్, టాయ్లెట్లను ఆయన ప్రారంభించారు.