సీఎం హెల్ప్ సెంటర్కు 10 లక్షల ఫిర్యాదులు
ABN , First Publish Date - 2021-02-27T14:21:00+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా 15 రోజుల్లో సీఎం హెల్ప్ సెంటర్కు 10 లక్షల ఫిర్యాదు లందాయని రెవెన్యూ శాఖ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ పేర్కొ న్నారు. పింఛన్, పట్టా, విద్య ఆర్ధికసాయం తదితర ఫిర్యాదులను ప్రజలు ప్రత్యక్ష్యంగా
చెన్నై/ప్యారీస్(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 15 రోజుల్లో సీఎం హెల్ప్ సెంటర్కు 10 లక్షల ఫిర్యాదు లందాయని రెవెన్యూ శాఖ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ పేర్కొ న్నారు. పింఛన్, పట్టా, విద్య ఆర్ధికసాయం తదితర ఫిర్యాదులను ప్రజలు ప్రత్యక్ష్యంగా ప్రభుత్వానికే తెలియజేసే పథకాన్ని సీఎం పళనిస్వామి ఈ నెల 13న ప్రారంభించారు. ‘1100’ అనే హెల్స్ లైన్ నెంబరు ద్వారా కానీ, ఎస్ఎంఎస్ ద్వారా ప్రజలు తమ ఫిర్యాదులను షోలింగనల్లూర్లో ఉన్న సీఎం హెల్ప్ సెంటర్ను సంప్రదించి ఫిర్యాదు నమోదుచేసు కోవచ్చు. ఈ సెంటర్ను శుక్రవారం పరిశీలిం చిన సందర్భంగా మంత్రి ఉదయకుమార్ మీడియాతో మాట్లాడుతూ, సుమారు రూ.13 కోట్లతో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరింపజేసే విధంగా సీఎం ప్రారంభించిన ఈ కేంద్రానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తున్న ఈ కేం ద్రాన్ని 15 రోజుల్లో సుమారు 10 లక్షల మంది సంప్రదించి తమ సమస్యలు తెలియజేసారని 2 లక్షలకు పైగా ఫిర్యాదులపై సంబంధిత శాఖల అధికారుల ద్వారా పరిష్కారం కల్పించినట్లు మంత్రి తెలిపారు.