దంతాలు మెరవాలంటే..!
ABN , First Publish Date - 2021-05-20T18:14:17+05:30 IST
మిలమిలమెరిసే దంతాలు ముఖారవిందాన్ని పెంచుతాయి. దంతాలు మెరవాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటంటే...

ఆంధ్రజ్యోతి(20-05-2021)
మిలమిలమెరిసే దంతాలు ముఖారవిందాన్ని పెంచుతాయి. దంతాలు మెరవాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటంటే...
దంతాలు తెల్లగా కావాలంటే బేకింగ్ సోడా చక్కగా ఉపకరిస్తుంది. బేకింగ్సోడాను అరచెంచా తీసుకుని టూత్పేస్ట్తో మిక్స్ చేసుకుని బ్రష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాలపై పేరుకుపోయిన గార తొలగిపోతుంది. ఇలా వారంలో రెండు రోజులు చేస్తే చాలు.
నిమ్మలో బ్లీచింగ్ ఏజెంట్స్ ఉంటాయి. ఇది దంతాల పసుపుదనాన్ని అద్భుతంగా పోగొడుతుంది. నిమ్మ తొక్కలను తీసుకుని దంతాలపై రాసుకోవడం లేదా నిమ్మరసంను కొన్ని నీళ్లలో కలుపుకొని నోట్లో పోసుకుని పుక్కిలించినా సరిపోతుంది.
రోజూ ఒక యాపిల్ తింటే ఆరోగ్యంగా ఉండటమే కాకుండా దంతాలు కూడా తెల్లగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. యాపిల్లో ఉన్న అమ్ల గుణం దంతాలు మెరిసేలా చేస్తుంది.
స్టాబెర్రీలకు దంతాలు మెరిసేలా చేసే గుణం ఉంది. స్టాబెర్రీలను పేస్ట్ మాదిరిగా చేసి దంతాల మీద రబ్ చేస్తే దంతాలు తెల్లగా అవుతాయి.
దంతాలు మెరిసేలా చేయడంలో తులసి కూడా ఉపయోగపడుతుంది. తులసి ఆకులను పేస్ట్ మాదిరిగా చేసి పళ్లు తోముకుంటే దంతాలు మెరుస్తాయి.
నారింజ తొక్కల్లో కాల్షియం, విటమిన్ సి ఉంటుంది. వీటికి నోట్లో బ్యాక్టీరియాపై పోరాడే గుణం ఉంటుంది. అంతేకాకుండా దంతాలు పసుపు రంగుకు మారకుండా కాపాడుతుంది. కాబట్టి వారంలో మూడు రోజులు నారింజ తొక్కలతో దంతాలను రబ్ చేయాలి.