బియ్యప్పిండితో మేనికి మెరుపు

ABN , First Publish Date - 2021-03-22T17:48:08+05:30 IST

బియ్యప్పిండితో చేసే ఫేస్‌మాస్కులు చర్మానికి కాంతినిస్తాయి. చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. బియ్యప్పిండితో ఫేస్‌మాస్కులు ఎలా చేసుకోవాలంటే...

బియ్యప్పిండితో మేనికి మెరుపు

ఆంధ్రజ్యోతి(22-03-2021)

బియ్యప్పిండితో చేసే ఫేస్‌మాస్కులు చర్మానికి కాంతినిస్తాయి. చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. బియ్యప్పిండితో ఫేస్‌మాస్కులు ఎలా చేసుకోవాలంటే...


ఒక గిన్నెలో ఒక టేబుల్‌స్పూన్‌ బియ్యప్పిండి, ఒక టేబుల్‌స్పూన్‌ అలొవెరా జెల్‌, ఒక టేబుల్‌స్పూన్‌ తేనె వేసి మూడింటిని బాగా కలిపి మెత్తటి పేస్టులా చేసుకోవాలి. కాసేపయ్యాక ఆ పేస్టును బాగా కలిపి ముఖానికి మాస్క్‌లా అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి  నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేస్తే చర్మం మెరుస్తుంది.


ఒక గిన్నెలో టేబుల్‌స్పూను బియ్యప్పిండి, అరటిపండు గుజ్జు, అరటేబుల్‌స్పూను ఆముదం వేసి బాగా  కలిపి పేస్టులా చేయాలి. దీన్ని కళ్లకింద రాసుకుని అరగంట తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా చేస్తే చర్మం నిగారింపు పెరుగుతుంది.


రెండు టేబుల్‌స్పూన్ల బియ్యప్పిండి, సరిపడా పాలు ఒక గిన్నెలో వేసి ఆ మిశ్రమాన్ని మెత్తగా కలపాలి. ఆ పేస్టును ముఖానికి పూతలా రాసుకుని అరగంట తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్‌ప్యాక్‌లు తరచుగా ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Updated Date - 2021-03-22T17:48:08+05:30 IST