24వ సీఈసీగా సుశీల్‌చంద్ర బాధ్యతలు

ABN , First Publish Date - 2021-04-14T06:59:50+05:30 IST

భారత ఎన్నికల సంఘం 24వ ప్రధాన కమిషనర్‌గా సుశీల్‌చంద్ర బాధ్యతలు స్వీకరించారు. సీఈసీగా సునీల్‌ అరోరా పదవీకాలం సోమవారం ముగిసింది

24వ సీఈసీగా సుశీల్‌చంద్ర బాధ్యతలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 13: భారత ఎన్నికల సంఘం 24వ ప్రధాన కమిషనర్‌గా సుశీల్‌చంద్ర బాధ్యతలు స్వీకరించారు. సీఈసీగా సునీల్‌ అరోరా పదవీకాలం సోమవారం ముగిసింది. దీంతో సీనియర్‌ ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సుశీల్‌చంద్రను ఆయన స్థానంలో ఎంపిక చేశారు. 1980 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన సుశీల్‌చంద్ర 2022, మే 14 వరకు సీఈసీగా కొనసాగుతారు. ఆయన సారథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం గోవా, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనుంది. 

Updated Date - 2021-04-14T06:59:50+05:30 IST