బీజేపీ.. అతిపెద్ద దోపిడీదారు: మమత

ABN , First Publish Date - 2021-03-21T07:11:29+05:30 IST

ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీదారు బీజేపీ అని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అన్నారు. బెంగాల్‌ను పాలించే అవకాశం ఆ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వొద్దని ఓటర్లను కోరారు

బీజేపీ.. అతిపెద్ద దోపిడీదారు: మమత

కోల్‌కతా, మార్చి 20: ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీదారు బీజేపీ అని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అన్నారు. బెంగాల్‌ను పాలించే అవకాశం ఆ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వొద్దని ఓటర్లను కోరారు. ‘‘మీకు (ప్రజలు) అల్లర్లులేని రాష్ట్రం కావాలంటే టీఎంసీ ఒక్కటే మార్గం. బీజేపీకి బెదిరించడమే తెలుసు. ప్రధాని మోదీ.. ప్రభుత్వ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటుపరం చేసి దేశాన్ని అమ్మేస్తున్నారు’’ అని మమత వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-03-21T07:11:29+05:30 IST