పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్లు
ABN , First Publish Date - 2021-03-21T18:00:08+05:30 IST
న్యూఢిల్లీలోని పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వివిధ విభాగాల్లో..

న్యూఢిల్లీలోని పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అకడమిక్ ప్రతిభ, అనుభవం ఆధారంగా షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఎక్కువగా వచ్చిన పక్షంలో రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
ఖాళీలు: మొత్తం 56 పోస్టులు
అసిస్టెంట్ జనరల్ మేనేజర్(లా) 1, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ 1, రిస్క్ మేనేజర్లు 4, ఐటీ మేనేజర్లు 50 ఉన్నాయి.
అర్హత వివరాలు: అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (లా) పోస్టుకు లా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 35 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్కు బిఈ/ బీటెక్(కంప్యూటర్ సైన్స్/ ఐటీ)/ఎంసీఏ ఉత్తీర్ణులై ఉండాలి. ఏదైనా ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు డిప్లొమా(కంప్యూటర్ అప్లికేషన్స్) పూర్తిచేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సీఐఎ్సఏ, సీఐఎ్సఎ్సపీ సర్టిఫికేషన్ తప్పనిసరి. వయసు 35 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. రిస్క్ మేనేజర్లకు ప్రథమ శ్రేణి మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు పీజీ(మేథమెటిక్స్/ స్టాటిస్టిక్స్/ ఎకనామిక్స్/ రిస్క్ మేనేజ్మెంట్)/ ఎంబీఏ / పీజీ డిప్లొమా(ఫైనాన్స్/ బ్యాంకింగ్/ రిస్క్ మేనేజ్మెంట్) పూర్తిచేసి ఉండాలి. సీఏ/ ఐసీడబ్ల్యుఏఐ/ సీఎస్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీ మేనేజర్లకు కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ టెక్నాలజీ/ కంప్యూటర్ ఇంజనీరింగ్/ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/ ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో బిఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణత అవసరం. ఎంసీఏ అభ్యర్థులు కూడా అర్హులే. మేనేజర్ పోస్టులకు 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసుండాలి. అన్ని పోస్టులకూ నిర్దేశిత అనుభవం తప్పనిసరి.
ముఖ్య సమాచారం
ప్రొబెషన్: ఏజీఎం(లా), చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్లకు ఆర్నెల్లు; రిస్క్ మేనేజర్లు, ఐటీ మేనేజర్లకు ఏడాది.
దరఖాస్తు ఫీజు: జీఎ్సటీతో కలిపి రూ.1003 (దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.177)
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 3
దరఖాస్తు హార్డు కాపీ చేరేందుకు చివరి తేదీ: ఏప్రిల్ 9
చిరునామా: ద డిప్యూటీ జనరల్ మేనేజర్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, అయిదవ అంతస్తు, బ్యాంక్ హౌస్, 21, రాజేంద్ర ప్యాలెస్, న్యూఢిల్లీ - 110008.
వెబ్సైట్: www.psbindia.com