విద్యార్థులకు అద్భుత అవకాశం.. వెంటనే అప్లయ్ చేసుకోండి..!
ABN , First Publish Date - 2021-11-14T16:25:37+05:30 IST
విద్యార్థులకు అద్భుత అవకాశం..
హైదరాబాద్, మాసబ్ట్యాంక్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) - నీట్ లాంగ్ టర్మ్ ఉచిత శిక్షణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకొనే షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామాల్లో నివసించేవారికి రూ.1,50,000; నగరాల్లో ఉండేవారికి రూ.2,00,000 మించకూడదు. బైపీసీ గ్రూప్తో ఇంటర్/పన్నెండో తరగతి ఉత్తీర్ణులై నీట్ యూజీ 2021 రాసి ఉండాలి. టీఎస్ ఎంసెట్ 2021 రాసిన విద్యార్థులు కూడా అప్లయ్ చేసుకోవచ్చు.
నీట్లో 250, టీఎస్ ఎంసెట్లో 80కి పైగా మార్కులు ఉండాలి. నీట్ యూజీ/ టీఎస్ ఎంసెట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నీట్ అభ్యర్థులకు 70 శాతం, టీఎస్ ఎంసెట్ అభ్యర్థులకు 30 శాతం సీట్లు కేటాయించారు. రంగారెడ్డి జిల్లా, గౌలిదొడ్డిలోని టీఎస్డబ్ల్యుఆర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: రూ.100
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 20
ఎంపికైన అభ్యర్థులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పంపు తేదీ: డిసెంబరు 1
సర్టిఫికెట్ల వెరిఫికేషన్: డిసెంబరు 2
తరగతులు ప్రారంభం: డిసెంబరు 3 నుంచి
వెబ్సైట్: www.tswreis.in