ప్రజలకు సత్వర సేవలందించాలి

ABN , First Publish Date - 2021-07-30T05:04:20+05:30 IST

పోలీసు అధికారులు నిత్యం అప్ర మత్తంగా.. అవినీతిరహితంగా ఉంటూ ప్రజలకు సత్వర సేవలందించాలని జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌శర్మ ఆదేశించారు.

ప్రజలకు సత్వర సేవలందించాలి

జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌  

ఏలూరు క్రైం, జూలై 29 : పోలీసు అధికారులు నిత్యం అప్ర మత్తంగా.. అవినీతిరహితంగా ఉంటూ ప్రజలకు సత్వర సేవలందించాలని జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌శర్మ ఆదేశించారు. గురువారం ఏలూరులోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష సమావేశం జరిగింది. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, మద్యం అక్రమ రవా ణాను అరికట్టాలని, ప్రభుత్వం నిషేధించిన గుట్కా, ఖైనీల అమ్మకాలు జిల్లాలో జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి గ్రామాన్ని పోలీసు అధికారులు సందర్శించి సమస్యలను తెలుసు కుని చిన్న చిన్న సమస్యలుంటే త్వరితగతిన పరిష్కరించాలన్నారు. రాత్రి వేళ గస్తీ ముమ్మరం చేయాలని ఆదేశించారు. అదనపు ఎస్పీ సుబ్బరాజు, ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ జయరామరాజు, డీఎస్పీలు, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ కొండలరావు, బీసీఆర్‌బీ సీఐ ప్రసాదరావు, పోలీసు న్యాయ సలహాదారుడు కె.గోపాలకృష్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-30T05:04:20+05:30 IST