చట్టాలపై మహిళలకు అవగాహన ఉండాలి
ABN , First Publish Date - 2021-09-18T05:20:05+05:30 IST
మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు ఉన్నాయని వాటి పై అవగాహన లేకపోవడం వల్లే వినియోగించుకోలేక నష్ట పోతున్నారని, మహిళలు చట్టా లపై అవగాహన కలిగి ఉండాలని ఏలూరు సెకండ్ ఏజేఎఫ్సీఎం కోర్టు మెజిస్ట్రేట్ ఎం.ప్రమీలారాణి అన్నారు.
ఏలూరు క్రైం, సెప్టెంబరు 17: మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు ఉన్నాయని వాటి పై అవగాహన లేకపోవడం వల్లే వినియోగించుకోలేక నష్ట పోతున్నారని, మహిళలు చట్టా లపై అవగాహన కలిగి ఉండాలని ఏలూరు సెకండ్ ఏజేఎఫ్సీఎం కోర్టు మెజిస్ట్రేట్ ఎం.ప్రమీలారాణి అన్నారు. ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాపీమేస్త్రి కాలనీలో ఉన్న ప్రజలకు న్యాయవిజ్ఞాన సదస్సును శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ పలు చట్టాలను వివరించారు. టూటౌన్ ఎస్ఐ బి.నాగబాబు, న్యాయవాదులు కేఎస్ నాగలక్ష్మి, పి.వెంకటేశ్వరరావు, వైసీపీ నాయకుడు తోటకూర కిషోర్ పలువురు పాల్గొన్నారు.
జిల్లా న్యాయవిజ్ఞాన అధికార సంస్ధ అర్హత కలిగిన వారికి ఉచిత న్యాయం అందిస్తుందని ప్రజలకు మరింత చేరువగా ఉండ డానికి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డి.బాలకృష్ణయ్య అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు ఆదేశాల మేరకు ఏలూరులోని 56, 58 నెంబర్లు గల సచివాలయాల్లో న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహించారు.