ఉద్యోగుల బైఠాయింపు
ABN , First Publish Date - 2021-01-21T04:28:12+05:30 IST
కొవిడ్ – 19 ప్రోగ్రామ్లో భాగంగా నియమించిన నర్సు, ఏఎన్ఎం, ఎఫ్ఎన్వో తదితర ఉద్యోగులకు పెండింగ్ జీతాల బకాయిలు చెల్లించాలంటూ ఉద్యోగులు బుధవారం డీఎంహెచ్వో కార్యాలయం వద్ద బైఠాయించారు.

ఏలూరు ఎడ్యుకేషన్, జనవరి 20 : కొవిడ్ – 19 ప్రోగ్రామ్లో భాగంగా నియమించిన నర్సు, ఏఎన్ఎం, ఎఫ్ఎన్వో తదితర ఉద్యోగులకు పెండింగ్ జీతాల బకాయిలు చెల్లించాలంటూ ఉద్యోగులు బుధవారం డీఎంహెచ్వో కార్యాలయం వద్ద బైఠాయించారు. తమ ఉద్యోగాలకు భరోసా కల్పించాలం టూ డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైన వెంటనే బకా యి జీతాలు చెల్లిస్తామని కార్యాలయ అధికారులు హామీ ఇచ్చారు. ఉద్యోగ కాలం పొడిగింపుపై ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.