32 కరోనా కేసులు నమోదు
ABN , First Publish Date - 2021-06-20T04:25:42+05:30 IST
గ్రామాల్లో కొవిడ్ తగ్గుముఖం పడుతోంది. దాదాపు రెండు నెలల పాటు ఉగ్రరూపం చూపించిన కొవిడ్ మహమ్మారి శాంతినట్లే కనిపిస్తోంది.
ఏలూరు రూరల్/దెందులూరు/పెదవేగి/పెదపాడు, జూన్ 19 : గ్రామాల్లో కొవిడ్ తగ్గుముఖం పడుతోంది. దాదాపు రెండు నెలల పాటు ఉగ్రరూపం చూపించిన కొవిడ్ మహమ్మారి శాంతినట్లే కనిపిస్తోంది. శనివారం ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో అధికారులు, వైద్యశాఖ సిబ్బంది ఊపిరి పీల్చు కున్నారు. గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు నిర్వహించారు. అధికారులు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు కారణంగా కొవిడ్ తగ్గు ముఖం పడుతోందని కొవిడ్ టాస్క్ఫోర్స్ చైర్మన్, ఏలూరు తహసీల్దార్ బి.సోమశేఖర్ తెలిపారు. దెం దులూరు మండలంలో పోతునూరు, దోసపాడు, రామారావుగూడెంలో ఒక్కొ క్కటి, గోపన్నపాలెంలో 3 మొత్తం 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయి నట్టు తహసీల్దార్ నాంచారయ్య, ఎంపీడీవో లక్ష్మీ తెలిపారు. పెదవేగి మండలంలో శనివారం 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పెదవేగి ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ టీవీఎల్.ప్రసన్నకుమార్ చెప్పారు. ఇప్పటివరకు మండలంలో 1203 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, వారిలో హోం ఐసోలేషన్లో 950 మంది ఉండి, చికిత్స పూర్తిచేసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం 149మంది హోం ఐసోలేషన్లో ఉన్నారని, 84 మంది ఆస్పత్రిలో చికి త్స పొందుతున్నారని వరించారు. కరోనా పాజిటివ్ మరణాలు 20 కాగా అందు లో నలుగురు ఇంటిదగ్గర మృతి చెందగా, 16 మంది ఆస్పత్రిలో మృతి చెందారన్నారు. పెదపాడు పీహెచ్సీ పరిధిలో వసంతవాడ, సత్యవోలులో మూడేసి, నాయుడుగూడెంలో 2, పాతముప్పర్రు, కొత్తముప్పర్రు, గుడిపాడు ఒక్కొక్కటి చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వట్లూరు పీహెచ్సీ పరిధిలో కొత్తూరులో ఒక పాజిటివ్ కేసు నమోదైంది.