2197 నామినేషన్లు ఓకే..

ABN , First Publish Date - 2021-02-06T05:48:54+05:30 IST

నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది.

2197 నామినేషన్లు ఓకే..

నిడదవోలు/ పెరవలి/ ఉండ్రాజవరం, ఫిబ్రవరి 5 : నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. నిడదవోలు మండలం 23 గ్రామాల్లో సర్పంచ్‌ అభ్య ర్థులకు 137 నామినేషన్లు దాఖలయ్యారు. 16 రెండేసి నామినేషన్లు చొప్పున దాఖలు చేయడంతో 16 నామినేషన్లు తిరస్కరించారు. దీంతో బరిలో 121 మంది అభ్యర్థులు నిలిచారు. వార్డులకు 678 నామినేషన్లు దాఖలు కాగా 10 డబుల్‌ నామినేషన్లు దాఖలయ్యాయి. ఒక్క నామినేషన్‌కు కులధ్రువీకరణ పత్రం సరిగా లేకపోవడంతో మొత్తంగా 11 నామినేషన్లు తిరస్కరించారు.దీంతో 667 నామినేషన్లు మిగిలాయి. వీటిలో వార్డులకు సంబంధించి 36 సింగిల్‌ నామినేషన్లు దాఖలయ్యాయి.పెరవలి మండలంలో 8 నామినేషన్లు తిరస్కరిం చారు. పరిశీలన అనంతరం మొత్తం మీద సర్పంచ్‌ల నామినేషన్లు 87, వార్డు సభ్యుల నామినేషన్లు 584 పోటీలో ఉన్నట్టు ధ్రువీకరించారు. ఉండ్రాజవరం మండలంలో మూడు నామినేషన్లు తిరస్కరించారు. 15 గ్రామాల సర్పంచ్‌ అభ్యర్థుల నామినేషన్లు 83, 186 వార్డులకు సంబంధించి 655 నామినేషన్లు అర్హత సాధించాయి. మూడు మండలాల్లోనూ మొత్తంగా 2197 నామినేషన్లు మిగిలినట్టు ఎన్నికల అధికారులు ధ్రువీకరించారు. 


Updated Date - 2021-02-06T05:48:54+05:30 IST