AP: జంగారెడ్డిగూడెంలో కొనసాగుతున్న బంద్

ABN , First Publish Date - 2021-10-20T13:38:28+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన బంద్ కొనసాగుతోంది.

AP: జంగారెడ్డిగూడెంలో కొనసాగుతున్న బంద్

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన బంద్ కొనసాగుతోంది. బంద్‌లో పాల్గొంటున్న 15 మంది టీడీపీ కార్యకర్తలను ఆర్టీసీ బస్టాండ్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ప్రధాన కూడళ్లలో భారీగా పోలీసులు  మోహరించారు.  టీడీపీ కార్యకర్తల అరెస్ట్‌లపై ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు  పోలీసు బందోబస్తు మధ్య ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. 

Updated Date - 2021-10-20T13:38:28+05:30 IST