కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
ABN , First Publish Date - 2021-05-03T05:03:05+05:30 IST
కొవిడ్తో బాధపడుతూ నిడదవోలు పట్టణానికి చెందిన ఓ విద్యా సంస్థ నిర్వాహకురాలు (60) మృతి చెందారు. మూడు రోజులుగా నిడదవోలు కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు
![కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
నిడదవోలు, మే 2 : కొవిడ్తో బాధపడుతూ నిడదవోలు పట్టణానికి చెందిన ఓ విద్యా సంస్థ నిర్వాహకురాలు (60) మృతి చెందారు. మూడు రోజులుగా నిడదవోలు కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆది వారం రాత్రి మృతి చెందారు. ప్రభుత్వం ఎంపిక చేసిన కొవిడ్ ఆసుపత్రిలో ఆక్సిజన్, వెంటిలేటర్ వంటి సౌకర్యాలు లేకపోవడంతో బాధితుల బంధు వులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కొవిడ్ ఆసుపత్రిలో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.