పాము కాటుకు తాత, మనవడు మృతి
ABN , First Publish Date - 2021-10-23T14:29:26+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం అలుగుల గూడెంలో విషాదం చోటు చేసుకుంది.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం అలుగుల గూడెంలో విషాదం చోటు చేసుకుంది. రాత్రి పాము కాటు వేయడంతో తాత కమ్ముల నంబూద్రీపాద్( 55), మనవడు కమ్ముల అధ్విక్ మృతి చెందాడు. తాత, మనవడు ఒకేసారి మరణించడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.