భీమడోలు జంక్షన్‌లో రైతు సంఘాల నిరసన

ABN , First Publish Date - 2021-02-07T05:21:14+05:30 IST

రైతు వ్యతిరేక చట్టాలను నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ సుమారు గంట సేపు రోడ్డు దిగ్బంధనం చేశారు.

భీమడోలు జంక్షన్‌లో రైతు సంఘాల నిరసన

భీమడోలు, ఫిబ్రవరి 6 : రైతు వ్యతిరేక చట్టాలను నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ సుమారు గంట సేపు రోడ్డు దిగ్బంధనం చేశారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా శనివారం భీమడోలు జంక్షన్‌లో రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. సీఐటీయూ జిల్లా ఉపా ధ్యక్షుడు ఆర్‌.లింగరాజు, రైతు సంఘం సహాయ కార్యదర్శి భాస్కరరావు మాట్లాడుతూ 70 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు ఉద్యమిస్తుంటే నీరో చక్రవర్తిలా మోదీ ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గు చేటన్నారు. వంద కోట్ల మంది రైతు జీవితాలను బలిపెట్టే నల్లచట్టాలను తక్షణమే రద్దు చేయా లని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం మండల కార్య దర్శి వెజ్జు శ్రీరామచంద్రమూర్తి, సాల్మన్‌రాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-07T05:21:14+05:30 IST