Westgodavari జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలు

ABN , First Publish Date - 2021-09-03T15:41:04+05:30 IST

జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలపై పోలీసులు ఆంక్షలు విధించారు.

Westgodavari జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలు

ఏలూరు:  జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలపై పోలీసులు ఆంక్షలు విధించారు.  వీధులలో విగ్రహ ప్రతిష్ఠ, ఊరేగింపు, మనుషులు ఒకేచోట గుమికూడడాన్ని నిషేధిస్తున్నట్లు ఎస్పీ రాహూల్ దేవ్ శర్మ తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలు తమ ఇండ్లలో, ప్రైవేటు ప్రదేశాలలో విగ్రహ ప్రతిష్ట చేసుకోవచ్చన్నారు. వినాయక చవితి తొమ్మిది రోజులు ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ఊరేగింపులు జరపకూడదని ఎస్పీ ఆదేశించారు. నిమజ్జనం  ఊరేగింపులపై నిషిద్ధం విధించినట్లు చెప్పారు. ప్రజలు తమ వాహనాల్లో  వెళ్లి విగ్రహాన్ని నిమజ్జనం చేసుకోవచ్చన్నారు. జిల్లా ప్రజలకు ఎస్పీ రాహూల్ దేవ్ శర్మ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. 

Updated Date - 2021-09-03T15:41:04+05:30 IST