AP: బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం
ABN , First Publish Date - 2021-08-21T14:23:00+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలంలోని పంగిడిగూడెం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.
![AP: బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలంలోని పంగిడిగూడెం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బాలికను అంజి బాబు అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు నిందితుడు అంజిబాబుపై ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.