ఎస్బీఐలో లూటీకి యత్నించిన యువకుల అరెస్ట్
ABN , First Publish Date - 2021-07-10T15:37:19+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం దిరసుమర్రు ఎస్బీఐలో లూటీకి యత్నించిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం దిరసుమర్రు ఎస్బీఐలో లూటీకి యత్నించిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ కెమెరాలు, తాళాలు పగలగొట్టి చోరీ చేసేందుకు ఇద్దరు యువకులు విఫలయత్నం చేశారు. దుండగులను గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో గ్రామస్థుల సహకారంతో ఇద్దరు యువకులను భీమవరం రూరల్ పోలీసులు పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.