నీటి వివాదంపై సబ్ కలెక్టర్ పరిశీలన
ABN , First Publish Date - 2021-03-23T04:40:49+05:30 IST
పాలకోడేరు, కుముదవల్లి సరిహద్దు పంట బోదెల వద్ద రైతుల మధ్య నీటి వివాదం నెలకొంది.
![నీటి వివాదంపై సబ్ కలెక్టర్ పరిశీలన](https://media.andhrajyothy.com/appimg/galleries/2021032211092750/03222021231047n75.jpg)
పాలకోడేరు, మార్చి 22: పాలకోడేరు, కుముదవల్లి సరిహద్దు పంట బోదెల వద్ద రైతుల మధ్య నీటి వివాదం నెలకొంది. నరసాపురం సబ్ కలెక్టర్ కేఎస్.విశ్వనాథన్ సోమవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. పంట బోదెలో అడ్డుకట్ట వివాదం పరిష్కరించాలని ఇరిగేషన్ ఏఈ వినయ్, తహసీల్దారు శ్యాంప్రసాద్కు సబ్కలెక్టర్ సూచించారు.